పంచాయతీ భవనాలకు వైకాపా రంగులు : తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు

బుధవారం, 20 మే 2020 (17:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పంచాయతీ భవనాలకు అధికార వైకాపా జెండా గుర్తులు వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసింది. దీంతో తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. 
 
ఈ పిటిషన్‌ని ప్రముఖ న్యాయవాది సోమయాజులు దాఖలు చేయగా, దాన్ని స్వీకరించిన కోర్టు పలు దఫాలుగా విచారణ జరిపింది. పంచాయతీ భవనాలకు ఇప్పటికీ పార్టీ రంగులను పోలినవే వేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. స్పందించిన న్యాయస్థానం.. ఆ రంగులను తొలగించమని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తుచేసింది.
 
స్పందించిన ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. వాటికి ఏ ఉద్దేశంతో ఆ రంగులు వేస్తున్నామన్న వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు హైకోర్టుకు తెలిపారు. గతంలో వేసిన రంగుతోపాటు అదనంగా మరో రంగును కలిపి వేస్తున్నట్టు న్యాయస్థానానికి తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు