జగన్ తోనే అభివృద్ధి సాధ్యం: రోడ్ షోలో హాస్యనటుడు అలీ

శనివారం, 6 మార్చి 2021 (15:06 IST)
విజ‌య‌వాడ‌లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్ధుల గెలుపుకు మద్ధతుగా దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావుతో క‌లిసి ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు ప్రాంతాల్లో ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు అలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న ఏకైక నేత వైఎస్ జగన్ అన్నారు.
 
జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాల‌ని కోరారు. అప్ప‌ుడు వై.ఎస్. పాలన చూశాం. ఇప్పుడు జగన్ పాలనను చూస్తున్నాం అని అనందం వ్య‌క్తం చేశారు. అన్ని కులాల వారికి న్యాయం చేయాలన్నదే జగనన్న తపన  అన్నారు.
 
విజయవాడ న‌గ‌ర అభివృద్ధికి వంద‌ల కోట్లు రూపాయ‌ల‌ను కేటాయించిన ఘ‌న‌త జ‌గ‌నన్న‌ది అన్నారు. జగన్ ద్వారానే అభివృద్ధి సాధ్యం అన్నారు.. రోడ్ షో అనంత‌రం భ‌వానీపురం ద‌‌ర్గాలో పూలు ఛాద‌ర్ స‌మ‌ర్పించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు