కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ

గురువారం, 9 జులై 2020 (10:24 IST)
సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీలు)లో 2020-21 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

జూలై 10 నుంచి జూలై 23 వరకు ఆన్ లైనులో దరఖాస్తులు చేసుకోవచ్చ‌ని పేర్కొన్నారు. పేద, అనాథ, బడి బయటి పిల్లలు, డ్రాపౌట్ (మధ్యలో బడి మానేసినవారు) బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణించబడతాయని తెలిపారు.

ఈ దరఖాస్తులు https://apkgbv.apcfss.in/. వెబ్ సైట్ ద్వారా పొందవ‌చ్చ‌న్నారు. ఎంపికైన విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందించబడుతుందని తెలిపారు.

సంబంధిత పాఠశాల నోటీసు బోర్డులో, సమగ్ర శిక్షా వెబ్ సైట్ (https://ssa.ap.gov.in/SSA/)లోనూ చూసుకోవ‌చ్చ‌న్నారు. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే 9494383617, 9441270099 నంబర్లను సంప్రదించాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు