నెల్లూరుకు నైరుతి దిశగా మరో అల్పపీడనం

శుక్రవారం, 27 నవంబరు 2020 (09:25 IST)
నెల్లూరుకు నైరుతి దిశగా మరో అల్పపీడనం కేంద్రీకృతమైవుంది. ఇది మరికొన్ని గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం తిరుపతిక 35 కిలోమీర్లు, నెల్లూరుకు 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. 
 
దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
కాగా, ఇప్పటికే నివర్ తుఫాను ప్రభావంతో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. చేతికొచ్చిన పంట నాశనమైపోయింది. 
 
ఈ పరిస్థితుల్లో నెల్లూరుకు నైరుతి దిశగా మరో వాయుగుండం కొనసాగుతోంది. కొన్ని గంటల్లో ఈ వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. 
 
దీని ప్రభావంతో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు