రోజమ్మా, నువ్వు గ్రేటమ్మా, ఏం చేశారంటే..?

సోమవారం, 14 సెప్టెంబరు 2020 (19:57 IST)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా తన గొప్పతనాన్ని చాటుకున్నారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి 10 స్ట్రెచర్లను ఉచితంగా అందజేశారు. తన సొంత డబ్బులతో స్ట్రెచర్లను అందించారు. రాయలసీమ జిల్లాల నుంచి నిరుపేద రోగులు స్విమ్స్ ఆసుపత్రికి వస్తుంటారు.
 
దీన్ని దృష్టిలో ఉంచుకున్న రోజా ఉచితంగా స్టెచర్లను అందించారు. స్విమ్స్ ఉన్నతాధికారులు రోజాతో చర్చించిన నేపథ్యంలో వెంటనే స్పందించిన ఆమె స్టెచర్లను అందజేశారు. ఈ సంధర్బంగా రోజా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ప్రజలకు సేవ చేయాలని విజ్ఞప్తి చేశారు.
 
ఎపిలో ఎన్నో పథకాలను దిగ్విజయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తుంటే గత తెలుగుదేశం హయాంలో చంద్రబాబు 3 వేల కోట్ల రూపాయల అప్పులను రాష్ట్రానికి మిగిల్చారన్నారు రోజా. గతంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే బిజెపి, జనసేన పార్టీలు ఎక్కడికి వెళ్ళాయంటూ ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు