నామినేటెడ్ పోస్టులు ఖరారు! ఎవరికి ఏ పోస్టు?

గురువారం, 4 జులై 2019 (09:28 IST)
నామినేటెడ్ పోస్టుల కోసం రాష్ట్ర స్థాయిలో కొంద‌రి పేర్ల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. రోజాకు ఏపీఐఐసి ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. అదేవిధంగా మ‌హిళా క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్‌గా వాసిరెడ్డి ప‌ద్మ.. సీఆర్డీఏ ఛైర్మ‌న్‌గా ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని ఎంపిక చేసారు. 
 
ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా మోహ‌న్‌బాబుకు అవ‌కాశం ద‌క్క‌నుంది. ఆర్టీసి ఛైర్మ‌న్‌గా అంబ‌టి రాంబాబు పేరు ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. కాపు కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా గ్రంధి శ్రీనివాస్ పేరు ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌విని ద్రోణంరాజు శ్రీనివాస్‌ పేరు వినిపిస్తోంది. 
 
పోలీస్ హౌసింగ్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా యేసుర‌త్నం.. సివిల్ స‌ప్ల‌యిస్ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా ఆమంచి కృష్ణ‌మోహ‌న్.. ఎస్సీ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా మోషేన్ రాజు.. వ‌క్ఫ్ బోర్డు ఛైర్మ‌న్‌గా మ‌హ్మ‌ద్ ముస్తఫా.. ఇత‌ర ఛైర్మ‌న్ల పోస్టుల‌ను జ‌గ‌న్ దాదాపు భ‌ర్తీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా భూమ‌న క‌రుణాక‌ర రెడ్డికి రాయ‌ల‌సీమ అభివృద్ది మండలి ఛైర్మ‌న్‌గా ఖ‌రారు చేయ‌నున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు