దుబాయ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆకుమర్తి జ్యోతి అరెస్ట్

మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (19:26 IST)
దుబాయ్‌లో మహిళలను నిర్బంధిస్తూ మోసం చేస్తూ వ్యభిచారంలోకి దింపుతున్న ఆకుమర్తి జ్యోతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆమెను అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన 11మంది మహిళలు తమను ఈ మురికి కూపం నుంచి రక్షించాలంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ ద్వారా తెలియజేసారు.
 
ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఇండియన్ ఎంబసీ ద్వారా బాధిత మహిళలను ఏపీకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో ఆకుమర్తి జ్యోతిపై మొగల్తూరు, కలిదిండి, టి నరసాపురం పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దీంతో దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న జ్యోతిని ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
 
వారు ఇచ్చిన సమాచారంతో జ్యోతిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు నరసాపురం పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఆకుమర్తి జ్యోతిది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు కావడం గమనార్హం. పోలీసు విచారణలో సెక్స్ రాకెట్‌కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోనికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు