కాలేజీ వెనుక స్నేహితుడితో యువతి, బలవంతంగా లాక్కెళ్లి గ్యాంగ్ రేప్...

గురువారం, 22 ఆగస్టు 2019 (20:19 IST)
చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థినిని కొంతమంది యువకులు బలవంతంగా ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారు. జిల్లాలో ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
మదనపల్లిలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ ఇసిఈ చదువుతున్న విద్యార్థిని తన స్నేహితుడితో మధ్యాహ్నం కళాశాల వెనుక మాట్లాడుతూ నిలబడింది. వీరిద్దరు ఏకాంతంగా ఉండడాన్ని చూసిన మదనపల్లిలోని అంగళ్ళుకు చెందిన జయచంద్ర, అప్ఝల్ విద్యార్థిని స్నేహితుడిని చితకబాది అమ్మాయిని బలవంతంగా స్కూటర్ పైన ఎత్తుకెళ్ళారు.
 
విద్యార్థిని కేకలు వేయడం అక్కడున్న వారందరూ చూశారు. ఏదో ఫ్రెండ్సే ఆటపట్టిస్తున్నారనుకుని ఊరుకున్నారు. అయితే ఆ ఇద్దరు యువకులు విద్యార్థిని హంద్రీ..నీవా ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్ళి అత్యాచారం చేశారు. తన స్నేహితుడు షామీర్‌కు ఫోన్ చేసి అక్కడకు పిలిపించి అతనితో కూడా ఆమెపై అత్యాచారం చేసే విధంగా ప్రోత్సహించారు. ముగ్గురు కలిసి ఆ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి వదిలేశారు.
 
విద్యార్థిని ఆ యువకుల నుంచి బయటపడి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. పోలీసుల ఫిర్యాదుతో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు