రకుల్‌ ‌కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి?: దివ్యవాణి

మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (08:53 IST)
టాలీవుడ్‌కు సంబంధించిన డ్రగ్స్‌ కేసు విచారణ వ్యవహారంపై సినీనటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలలని డిమాండ్ చేశారు. 

టీడీపీ-టీఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘తెలంగాణ మహిళా కమిషన్‌ ఆవశ్యకత-ఏర్పాటు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో దివ్యవాణి మాట్లాడారు.

వివిధ రంగాల్లో ఉన్నట్లుగానే సినీరంగంలోనూ డబ్బున్న వాళ్లదే రాజ్యమని తెలిపారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి? అని వ్యాఖ్యానించారు. వివిధ అవసరాల కోసం దిగజారే వారు సినీరంగంలో ఉన్నారని అన్నారు.

తన కూతురు చదువుతున్న కాలేజీలోనూ డ్రగ్స్‌కు అలవాటుపడ్డ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. సినీ పరిశ్రమలో పెద్ద వాళ్ల పిల్లలు సైతం డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు