రోడ్డు పక్కన కూర్చొని కూరగాయలు అమ్ముకుంటే.. నెమలికి..?

సోమవారం, 3 ఆగస్టు 2020 (13:32 IST)
peacock
రోడ్డు పక్కన కూర్చొని కూరగాయలు అమ్ముకోగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవాలి. ఒక్కోసారి పూట గడువడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది తాను తినే దాంట్లో కొంత ధాన్యపు గింజలను రోడ్డు పక్కన కూర్చొని ఇలా నెమలికి తినిపిస్తుంది.
 
ఆ మహిళ ఇంట్లో సిరిసంపదలు లేకపోవచ్చు. కానీ ఆమె హృదయం అంతా సంపదే. దీనికి సంబంధించిన వీడియోను టింకు వెంకటేశ్ అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 55 సెకన్ల పాటు నడిచే ఈ వీడియో ఆన్‌లైన్‌లోకి వచ్చిన కాసేపటికే వైరల్‌గా మారింది. 
 
ఇప్పటివరకు ఈ వీడియోను నాలుగు లక్షలకు పైగా వీక్షించారు. మహిళ చేతిలో ఉన్న ధాన్యపు గింజలను తింటున్న నెమలిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మనుషులను చూస్తేనే పారిపోయే నెమళ్లు ఈ మహిళను నమ్మి దగ్గరకు రావడం గమనార్హం అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు