వ్యాపారులకు ఆజియో నుంచి అద్భుతమైన అవకాశం; 19 వరకు 'సంబంధం- 2020' ఆన్‌లైన్ ట్రేడ్ షో

గురువారం, 17 సెప్టెంబరు 2020 (18:35 IST)
రిలయన్స్ రిటైల్‌కు చెందిన ఫ్యాషన్ వేర్ ప్లాట్‌ఫామ్ ఆజియో 'సంబంధం- 2020' పేరుతో ఆన్‌లైన్ ట్రేడ్ షో నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న రీటైలర్లను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. ప్రస్తతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రయాణాలు ఎక్కువగా చేసే పరిస్థితి లేదు. అలాగని వ్యాపారాలును ఆపే పరిస్థితి కూడా లేదు.
 
అందుకే వ్యాపారులు తమ కావాల్సిన దుస్తుల్ని కొనేందుకు 'సంబంధం డిజిటల్ ఫెస్టివల్ 2020' వర్చువల్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ మెగా ట్రేడ్ షో 2020 సెప్టెంబర్ 17న ప్రారంభమైంది. సెప్టెంబర్ 19న ముగుస్తుంది. ఈ ట్రేడ్ షోలో రాబోయే ఫెస్టివల్ సీజన్‌కు కావాల్సిన దుస్తులను కొనొచ్చు.
 
దుస్తులతో పాటు ఆఫీసులు, ఇళ్లకు కావాల్సిన లగ్జరీ, సేఫ్టీ ప్రొడక్ట్స్ కూడా కొనొచ్చు. ఈ ఈవెంట్‌లో భారతదేశానికి చెందిన 70,000+ పైగా రీటైలర్లు పాల్గొంటారని అంచనా. ఆజియో 'సంబంధం- 2020' ఆన్‌లైన్ ట్రేడ్ షోలో 1,300 పైగా బ్రాండ్లకు చెందిన లక్షలాది స్టైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఫెస్టీవ్ కలెక్షన్ రూపొందించారు. 50 పైగా ఫెస్టీవ్ వేర్ బ్రాండ్స్ సరసమైన ధరలకే దుస్తుల్ని, వస్తువులను అమ్ముతున్నాయి. లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్స్‌కి తగ్గట్టుగా అప్‌డేట్ చేసిన ప్రొడక్ట్స్ కొనొచ్చు.
 
ఇందుకోసం వ్యాపారులు చేయాల్సిందల్లా ఆన్‌లైన్ ట్రేడ్ షోకు రిజిస్టర్ చేసుకోవడమే. ఇందుకోసం register.ajiosambandam.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత డిజిటల్ కేటలాగ్ ఉపయోగించిన ఆర్డర్స్ చేయొచ్చు. బ్రౌజ్ చేయడంతో పాటు వీడియోస్ చూసి తమ కు నచ్చినవాటిని విష్ లిస్ట్‌లో యాడ్ చేయొచ్చు. క్యాష్‌బ్యాక్ లాంటి ఆకర్షణీయమైన ఆఫర్స్ కూడా ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు