23వ రోజూ తగ్గని పెట్రోల్ ధరలు.. సామాన్యుడిపై భారం

సోమవారం, 29 జూన్ 2020 (10:10 IST)
కరోనా వేళ సామాన్యుడిపై భారం తగ్గలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. 23వ రోజూ తగ్గని పెట్రోల్ ధరలు తగ్గలేదు. వరుస ధరల పెరుగుదలకు ఒక రోజు విరామం తర్వాత సోమవారం పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం లీటర్‌ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
 
దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.43, లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.53కు చేరింది. దీంతో ఇప్పటివరకు లీటర్‌ డీజిల్‌పై మొత్తం రూ.10.39లు, లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.23లు పెరిగాయి.
 
అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు లీటరుకు ఎంత పెరిగాయంటే.. హైదరాబాద్ : పెట్రోల్‌ రూ.83.49; డీజిల్ రూ.78.69, విజయవాడ : పెట్రోల్‌ రూ.84.15; డీజిల్ రూ.79.19, చెన్నై: పెట్రోల్‌ రూ.83.63; డీజిల్ రూ.77.72, ముంబయి : పెట్రోల్‌ రూ.87.19; డీజిల్ రూ.78.83గా వున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు