కరోనా వైరస్ సంక్షోభంలో.. భారతీయ రైల్వే అదిరే రికార్డు.. ఏంటది?

మంగళవారం, 7 జులై 2020 (23:10 IST)
కరోనా వైరస్ సంక్షోభం సమయంలో, సరుకు రవాణా రైళ్లు దేశవ్యాప్తంగా అవసరమైన వస్తువులను సరఫరా చేసే అద్భుతమైన సేవలను అందించాయి. అయితే సాధారణ రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో. రైల్వే శాఖ మరమ్మతులపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వేస్ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్పటికే లాక్ డౌన్ సమయంలో, భారత రైల్వే భద్రత, నిర్వహణ మరియు మరమ్మత్తుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 200కి పైగా ప్రాజెక్టులను పూర్తి చేసింది. 
 
అంతటితో ఆగకుండా ''మిషన్ శీఘ్ర'' ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో డివిజన్‌లో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గూడ్స్ రవాణా రైలును నడపడంలో భారత రైల్వే విజయవంతమైంది. ఇదే విషయాన్ని రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేసి సమాచారాన్ని పంచుకున్నారు. ఇందులో ఆయన గూడ్స్ ట్రైన్ స్పీడోమీటర్ వీడియోను కూడా పంచుకున్నారు.
 
కరోనా సంక్షోభంలో భాగంగా గూడ్స్ రైలు సగటు వేగాన్ని మెరుగుపరిచే పని కూడా జరిగింది. గత నెలతో పోలిస్తే 2020 జూన్ 21 నాటికి ఈ రైళ్ల సగటు వేగం దాదాపు రెట్టింపు అయిందని గత నెల పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ ప్రకారం, జూన్ 2018లో ఈ రైళ్ల సగటు వేగం గంటకు 23 కిమీ, ఇది 2020 జూన్‌లో గంటకు 42 కిలోమీటర్లకు దాదాపు రెట్టింపు అయ్యింది.
 
భారత రైల్వే చరిత్రలో మొదటిసారిగా, 100 శాతం రైళ్లను తమ నిర్ణీత సమయానికి నడిపి గమ్యానికి చేర్చాయి. 1 జూలై 2020 న భారతీయ రైల్వే 201 రైళ్లను నడిపింది. ఈ రైళ్లన్నీ సమయానికి బయలుదేరి సమయానికి చివరి స్టేషన్‌కు చేరుకున్నాయి. ఇలా చేయడం ద్వారా భారత రైల్వే మొదటిసారిగా 100 శాతం విజయాన్ని సాధించింది. రైల్వే చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
 
అంతేకాదు భారతీయ రైల్వే ఇటీవల రెండు కిలోమీటర్ల పొడవైన రైలును నడుపుతూ కొత్త రికార్డు సృష్టించింది. ఈ రైలుకు 'సూపర్ అనకొండ' అని పేరు పెట్టారు. మొట్టమొదటిసారిగా, అలాంటి రెండు పొడవైన రైలు పట్టాలు దేశంలో నడిచాయి. 177 సరుకు రవాణా కోచ్‌లతో కూడిన ఈ సరుకు రవాణా రైలును నడపడం రైల్వేకు పెద్ద విజయమని రైల్వే మంత్రి పియూష్ గోయల్ రైలు వీడియోను షేర్ చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు