బ్యాంకు రుణగ్రహీతలకు గుడ్ న్యూస్.. రూ.2కోట్ల వరకు మారటోరియం వడ్డీ మాఫీ

శనివారం, 3 అక్టోబరు 2020 (12:44 IST)
బ్యాంకు రుణగ్రహీతలకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో విధించిన మారటోరియం కాలంలో రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై వడ్డీ మాఫీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది కేంద్రం. ఈ మేరకు, సుప్రీంకోర్టులో శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.. మార్చి నుంచి ఆగస్టు వరకు నెలవారి చెల్లించాల్సిన రుణాలపై వడ్డీ మాఫీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం.
 
చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలు, విద్యా రుణాలు, గృహరుణాలు, వాహన రుణాలు, క్రెడిట్‌ కార్డుల రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఫ్రొఫెషనల్ రుణాలపై వడ్డీ మాఫీ కానుంది.. ఈ మేరకు, మాజీ కంట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి కమిటీ ఇచ్చిన సూచనలను కేంద్రం ఆమోదించింది.
 
అయితే, ఆరునెలలపాటు అన్ని బ్యాంకు రుణాలపై వడ్డీ మాఫీ చేస్తే, బ్యాంకులు కుప్పకూలిపోతాయని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.. అలా అన్ని రకాల బ్యాంకు రుణాలపై వడ్డీని మాఫీ చేస్తే సుమారు 6 లక్షల కోట్ల రూపాయల భారాన్ని బ్యాంకులు భరించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్ధిక శాఖ పేర్కొంది. 
 
ఈ పరిణామం చాలా బ్యాంకుల మూలధనం మొత్తం కరిగిపోవడమే కాకుండా, బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కానీ, ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం.. రుణగ్రహీత తాత్కాలిక నిషేధాన్ని పొందారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా వడ్డీపై మాఫీ ఉంటుందని చెబుతోంది. అయితే, సోమవారం కూడా దీనిపై విచారణ జరుపబోతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు