భారత్‌లో కరోనావైరస్ తగ్గుముఖం, కొత్తగా 48,268 పాజిటివ్ కేసులు

సోమవారం, 2 నవంబరు 2020 (11:21 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య 82 లక్షలు 20 వేలుగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 45,230 కేసులు నమోదు కాగా 496 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 53,285 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ తెలిపింది. దేశంలో మొత్తం 82,29,313 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,61,908 ఉండగా 75,44,798మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉండగా 1,22,607 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 91.68 శాతంగా ఉంది. దేశంలో నమోదైన మొత్తం కేసులలో 1.49 శాతానికి మరణాల రేటు తగ్గింది. నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 6.83 శాతంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు