దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

గురువారం, 5 నవంబరు 2020 (10:35 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 50,209 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 704 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 83,64,086కు చేరాయి.
 
గడిచిన 24 గంటల్లో ఇండియాలో 55,331 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 77,11,809 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకోగా 1,24,315 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24గంటల్లో కొత్తగా 55,331 మంది డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో 12,09,384 టెస్టులు చేయగా ఇప్పటి వరకు 11,42,08,384 నమూనాలను పరిశీలించినట్లు వైద్య ఆరోగ్య తెలిపింది. ఇంకా 5,27,962 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు