ప్రపంచ చరిత్రలో మరపురాని యుద్ధం కార్గిల్ వార్

శుక్రవారం, 24 జులై 2020 (17:05 IST)
భారత చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోనే మరపురానిగా మిగిలిపోయిన యుద్ధం కార్గిల్ వార్. భారతదేశం విభజన తర్వాత పాకిస్థాన్  దాయాది దేశంగా ఆవిర్భవించింది. అప్పటి నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య విభేదాలు పెరిగాయి. అయితే, కాశ్మీర్ అంశంలో ఇరు దేశాల మధ్య కీచులాట మొదలైంది. కానీ, అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో, కాశ్మీర్ రాజు హరిసింగ్ కాశ్మీరును భారతదేశంలో విలీనం చేశాడు. 
 
అప్పటి నుండి, 1999 లో, కాశ్మీర్ ప్రక్కనే ఉన్న కార్గిల్ ప్రాంతాన్ని భారతదేశం ఆక్రమించడంలో పాకిస్థాన్ ఒక అడుగు ముందుకేసింది. ఇందుకోసం ఇరు దేశాల మధ్య సాగిన యుద్ధమే కార్గిల్ వార్. ఇది 1999 మే 3వ తేదీన ప్రారంభమై జూలై 26వ తేదీ వరకు కొనసాగింది. ఈ యుద్ధంలో అనేక వందల మంది సైనికులు అమరవీరులయ్యారు. ఈ యుద్ధాన్ని జ్ఞాపకార్థం జూలై 26న కార్గిల్ స్మారక దినోత్సవం జరుపుకుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు