భూ కదలికలపైనా కరోనా ప్రభావం

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (20:52 IST)
కరోనాతో కలుగుతున్న నష్టాన్ని సైతం శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలకు వినియోగిస్తున్నారు. ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ అమలుచేస్తున్న వేళ భూమిపై శబ్ద తీవ్రత తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది భూకంప శాస్త్రవేత్తలకు ఓ అవకాశాన్ని ఇచ్చిందని, తక్కువ స్థాయి ప్రకంపనలపై పరిశోధనలు చేసేందుకు వీలు కలిగిందని అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన శైలిని పూర్తిగా మార్చివేసింది.

ఈ మహమ్మారి గుప్పిట్లో నుంచి బయటపడేందుకు దేశాలన్నీ పూర్తిగా లాక్ డౌన్ లో ఉన్నాయి. అయితే ఈ నిర్బంధం ప్రజలను ఇబ్బంది పెడుతున్నా.. భూకంప శాస్త్రవేత్తలకు ఓ ప్రత్యేక అవకాశాన్ని తెచ్చిపెట్టింది.

సీస్మాలజీ.. భూకంపాలకు సంబంధించి శాస్త్రం. భూమిలో ప్రకంపనలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటారు శాస్త్రవేత్తలు. భూప్రకంపనల శబ్దం (సీస్మిక్ నాయిస్)ను గుర్తించి భూకంపాలు, అగ్ని పర్వత విస్ఫోటాలను గుర్తిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు