ఐపీఎల్ 13వ సీజన్ దుబాయ్‌లో తప్పకుండా జరుగుతుందా? 100%?

ఆదివారం, 19 జులై 2020 (13:09 IST)
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వెంటాడుతూ వున్నప్పటికీ.. ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లోనూ ఐపీఎల్ 13వ సీజన్ లేకుండా ముగించబోమని ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుందని తెలుస్తోంది. అయితే అక్టోబర్ వరకు భారత్‌లో పరిస్థితిని బట్టి బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. పరిస్థితి మెరుగు పడితే భారత్‌లోనే ఐపీఎల్ జరుగుతుంది. 
 
అలా కాకుంటే దుబాయ్‌లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. ఈ విషయంపై బీసీసీఐ చాలా స్పష్టతతో ఉంది. ఇక ఐపీఎల్ అక్టోబర్‌లో జరిగితే అప్పటికప్పుడు షెడ్యూల్ వేసుకోవడం కుదరదు కాబట్టి.. ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఫిక్స్ చేసి పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే భారత్‌లో కుదరకపోతే టోర్నీ 100 శాతం దుబాయ్‌లోనే జరుగుతుందని తెలుస్తోంది.
 
మరోవైపు బీసీసీఐ పలు దేశవాళీ క్రికెట్ టోర్నీలను కూడా రద్దు చేసింది. డిసెంబర్ వరకు దేశవాళీ టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దేశంలో భిన్న ఏజ్ గ్రూపుల్లో మొత్తం 38 దేశవాళీ టీంలు పలు టోర్నీల్లో మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. కానీ ఇవన్నీ కరోనా కారణంగా రద్దు అయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు