ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు.. రూపాయి చాలు..

శనివారం, 12 సెప్టెంబరు 2020 (16:25 IST)
Flipkart
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించింది. సెప్టెంబర్‌ 18న ప్రారంభమై సెప్టెంబర్‌ 20 వరకు రెండు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, టీవీ, యాక్సెసరీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా గ్యాడ్జెట్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. మరోవైపు ఆకర్షణీయమైన ఆఫర్లకు వివిధ క్రెడిట్ కార్డులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది.
 
ఈ స్పెషల్‌ సేల్‌ సమయంలో కస్టమర్లకు మరో అద్భుత అవకాశాన్ని కూడా కల్పించింది. కొనే వస్తువులను కేవలం ఒక్క రూపాయితోనే ముందస్తుగా బుకింగ్‌ చేసుకునే వెసలుబాటును కల్పింస్తోంది. అయితే ఈ ఫ్రీ బుకింగ్‌ను కేవలం సెప్టెంబర్‌ 15, 16 తేదీల్లో మాత్రమే అందిస్తోంది.
 
ఎస్బీఐ క్రెడిక్ కార్డు, ఈఎంఐ ద్వారా చెల్లింపుదారులకు తగ్గింపును అందిస్తోంది. మరోవైపు టీవీలు, అప్లయెన్సెస్‌ కొనుగోలు చేసే కస్టమర్ల కోసం నో-కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్ పొందాలనుకునే వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌ హోమ్‌ పేజీలోని ప్రీ-బుక్‌ స్టోర్‌లోకి వెళ్లాలి. అక్కడ రూ.1 చెల్లించి ఆర్డర్‌ను ముందుగానే బుక్ చేసుకోవాల్సి వుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు