ఇన్ఫినిక్స్ నుంచి జీరో 8ఐ కొత్త స్మార్ట్ ఫోన్.. ధర రూ.14,999

గురువారం, 3 డిశెంబరు 2020 (13:32 IST)
Infinix
ఇన్ఫినిక్స్ నుంచి కొత్తగా జీరో 8ఐ పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.85 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డ్యుయల్ పిన్ హోల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇన్పినిక్స్ జీరో 8ఐ స్మార్ట్ ఫోన్ సిల్వర్ డైమండ్‌, బ్లాక్ డైమండ్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. 
 
ఈ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. దీన్ని డిసెంబర్ 9వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తారు. ముందువైపు 16 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ డిస్‌ప్లే 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 
 
అందువల్ల వీడియోలు, గేమ్స్ స్మూత్‌గా వస్తాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్‌కు చెందిన హీలియో జి90టి ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. అందువల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. అలాగే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని సైతం ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్ హీట్‌కు గురి కాకుండా ఉంటుంది. 
 
ఇన్ఫినిక్స్ జీరో 8ఐ స్పెసిఫికేషన్స్‌…
* 6.85 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2460 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, 48, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 16, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు, డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్
* 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి90టి ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్
 
* 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్
* సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు