పబ్జీ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. అదేంటంటే..? భారత్‌లో మళ్లీ..?

గురువారం, 1 ఏప్రియల్ 2021 (20:50 IST)
పబ్జీ ప్రేమికులకు ఇది బ్యాడ్ న్యూసే.. ప్రపంచం మొత్తం పబ్జీని బ్యాన్ చేస్తున్నారు. ఎండ్ వెర్షన్ అయిన పబ్జి లైట్ ఏప్రిల్ 29న మొత్తానికి తొలగించనున్నారు. 2019లో ఎంట్రీ లెవెల్ మొబైల్ డివైస్‌లో దీనిని మొదలు పెట్టారు. భారత ప్రభుత్వం పబ్జి మొబైల్, పబ్జి మొబైల్ లైట్ సెప్టెంబర్ 2న గత ఏడాది పూర్తిగా తొలగించింది. కరోనా సమయంలో పబ్జిలైట్ చాలామందికి ఊరటనిచ్చింది. 
 
అయికే పబ్జీని చాలా కష్టాల తర్వాతే ఫైనల్‌గా తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 29 నుంచి పబ్జీని పూర్తిగా తొలగించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే కొన్ని రిపోర్టుల ప్రకారం పబ్జి మొబైల్‌ని తిరిగి భారత దేశంలో మరో రెండు మూడు నెలల తర్వాత ప్రారంభించొచ్చు అన్నట్టు తెలుస్తోంది. 91 మొబైల్స్ ప్రకారం భారత ప్రభుత్వం పబ్జి మొబైల్‌ని తిరిగి లాంచ్ చేయడానికి ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయంపై పబ్జి మొబైల్ ఇంకా ఏమీ స్పందించలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు