రెడ్‌మీ నోట్ 9 ప్రో ఫోన్ కొంటున్నారా?

మంగళవారం, 2 జూన్ 2020 (13:04 IST)
ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ షియోమీ ఇటీవల రెడ్‌మీ సిరీస్‌లో నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసిన సంగతి విదితమే. జూన్ 2వ తేదీ అనగా ఈరోజు మధ్యాహ్నం నుండి మరోసారి ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభించిన కొద్దిసేపటికే ఊహించిన స్థాయి కంటే ఎక్కువ విక్రయించబడ్డాయి. వినియోగదారుల నుంచి వచ్చిన అనూహ్య స్పందనను దృష్టిలో ఉంచుకుని, షియోమీ సంస్థ మరొకసారి ఫ్లాష్ సేల్ నిర్వహించాలని నిర్ణయించింది.
 
ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు అయిన అమెజాన్ ఇండియా, ఎంఐ డాట్‌కామ్ ద్వారా ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. మూడు రంగులలో ఈ ఫోన్ లభ్యమవుతుంది. రెడ్‌మీ నోట్ 9 ప్రో ఫోన్ 4GB + 64GB,  6GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. అయితే 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.13,999 కాగా 6జీబీ వేరియంట్‌ ధర రూ.16,999గా నిర్ణయించారు.
 
రెడ్‌మీ 9 ప్రో ఫోన్ స్పెసిఫికేషన్‌లు:
* డిస్‌ప్లే: 6.67 అంగుళాలు
* ప్రాసెసర్‌: స్నాప్‌డ్రాగన్‌ 720జీ
* ఫ్రంట్‌ కెమెరా: 19 మెగాపిక్సెల్‌
* రియర్‌ కెమెరా: 48MP + 8MP + 5MP + 2MP
* ర్యామ్‌: 4జీబీ
* ఇంటర్నెల్ స్టోరేజ్‌: 64జీబీ
* బ్యాటరీ కెపాసిటీ: 5020mAh
* ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు