ఫ్రెండ్ చెల్లెలితో శారీరక సంబంధం, అడ్డొస్తున్నాడని కిడ్నాప్ చేసి?

సోమవారం, 10 ఆగస్టు 2020 (22:55 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ ప్రాంతమది. అక్కడ నివసిస్తున్న దీపక్, విపిన్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకరి కోసం మరొకరు ప్రాణం ఇచ్చేంత స్నేహితులు వారు. అయితే దీపక్‌కు విపిన్ చెల్లెలిపై కన్ను పడింది. తరచూ విపిన్ ఇంటికి వెళ్ళే దీపక్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
 
ఆ పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది. ఇది గత మూడు నెలలుగా సాగుతోంది. స్నేహితుడి చెల్లెలిని చెల్లెలిగానే భావిస్తున్నాడని విపిన్ అనుకునేవాడు. అందుకే తన ఇంటికి వస్తున్న దీపక్‌ను ఆపేవాడు కాదు. కానీ అసలు విషయం కాస్తా ఆలస్యంగా తెలుసుకున్నాడు విపిన్. 
 
దీపక్‌ను హెచ్చరించాడు. అయినా మార్పు రాలేదు. దీంతో కోపంతో దీపక్‌పై చేయిచేసుకున్నాడు. తననే కొట్టాడని విపిన్ హత్యకు ప్లాన్ చేశాడు దీపక్. వెంటనే తన ఇద్దరు స్నేహితులు అశ్రు, రోహిత్‌ల సహాయంతో చంపేద్దామని నిర్ణయించుకున్నాడు. అయితే వారు సహకరించకపోవడంతో విపిన్ ఒక్కడే దీపక్‌ను హత్య చేశాడు.
 
ఆ తరువాత మృతదేహాన్ని తన ఇంటి ఆవరణలోనే అర్థరాత్రి పూడ్చేసి విషయం తన ఇద్దరు స్నేహితులకు చెప్పాడు. అశ్రు, రోహిత్‌లను పోలీసులకు ఫోన్ చేసి దీపక్‌ను కిడ్నాప్ చేసినట్లు చెప్పమన్నాడు. స్నేహితుడి కోసం వారిద్దరూ పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసి దీపక్‌ను కిడ్నాప్ చేశామని 20 లక్షలు కావాలని డిమాండ్ చేశారు.
 
అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అదంతా విపిన్ ఆడిస్తున్న నాటకమని తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు