షార్ట్ రేంజ్ డెలివరీ రేంజ్ మిస్సైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

మంగళవారం, 6 అక్టోబరు 2020 (15:16 IST)
షార్ట్ రేంజ్ డెలివరీ రేంజ్ మిస్సైల్‌కు కేంద్రం ఆమోదించింది.  సిద్ధం చేసిన ఈ మిస్సైల్... 700కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను ధ్వంసం చేయగలదు. 5వేల కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను టార్గెట్ చేసే క్రమంలో K-5 సబ్‌మెరైన్ బ్యాలిస్టిక్ మిస్సైల్‌ను లాంచ్ చేశారు.
 
ఈ శౌర్య మిస్సైల్ BA-05కు లాండ్యా వెర్షన్‌గా పనిచేస్తుంది. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (డీఆర్డీవో) డెవలప్ చేసింది. అప్రూవల్‌కు ముందు ఒడిశాలోని బాలాసోర్‌లో చివరిసారి పరీక్షించడంతో ప్రయోగంలో సక్సెస్ అయ్యారు. మిస్సైల్ నిపుణుల ఆధారంగా.. శౌర్య మిస్సైల్‌ను కాంపోజిట్ భాగంలో భద్రపరుస్తారు. ఈ స్ట్రాటజీ మిస్సైల్ వాతావరణంలో 50కిలోమీటర్ల ఎత్తులో సెకనుకు 2.4కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.
 
ఇండియన్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ గుర్తించిన టార్గెట్ లొకేషన్లలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గైడెన్స్ ఆధారంగా వాడతారు. ఈ మిస్సైల్ దాదాపు 160కేజీల బరువు ఉంటుంది. ఈ మిస్సైల్ ను ఒక సింగిల్ వెహికల్‌తో లాంచ్ చేసేయొచ్చు. 
 
దీంతో పాటు 5వేల కిలోమీటర్లు ప్రయాణించగలిగే సబ్ మెరైన్ లాంచ్‌డ్ బ్యాలిస్టిక్ మిస్సైల్ ను డెవలప్ చేయనుంది డీఆర్డీఓ. దాని సామర్థ్యం.. అగ్ని-5 ల్యాండ్ బేస్డ్ బ్యాలిస్టిక్ మిస్సైల్, K-5కు సమానంగా ఉంటాయి. ఈ మిస్సైల్ ను మరో 15నెలల తర్వాత మాత్రమే పరీక్షించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు