భర్త మోసం చేశాడు.. పిల్లలకు మత్తు మందు ఇచ్చి నిప్పంటించి.. ఆపై ఆమె కూడా?

శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (10:17 IST)
భర్త వేరొక యువతితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుని.. ఆమె కోసం తనను వదిలేశాడన్న మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేరే యువతితో వెళ్లిపోయాడని మనస్థాపానికి గురైన భార్య ముందుగా తన పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించి తరవాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడు అరంతాంగిలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... పుదుకోట్టై జిల్లా అరంతాంగి సమీపంలోని వల్లంబాక్కం కాడులో ముత్తు(45), రాధ(34) దంపతులు ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ముత్తు కొంతకాలంగా అరంతాంగిలోని ఓ కళాశాలలో చదువుకుంటున్న రత్న కోట గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతితో ప్రేమాయణం నడుపుతున్నాడు. భార్య పలు మార్లు మందలించినప్పటికీ అతడి తీరులో మార్పు రాలేదు.
 
అంతే కాకుండా విద్యార్థినిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఆ విద్యార్థినితో పరార్‌ అయ్యాడు. సమాచారంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాధను ప్రశ్నించడమే కాకుండా, ముత్తుపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. భార్య చేష్టలకు విసిగిపోయింది.
 
అవమానంగా భావించిన రాధ ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పిల్లలకు మత్తు మందు ఇచ్చి వారికీ నిప్పంటించింది. అనంతరం తానూ అగ్నికి ఆహుతయ్యింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భర్తపై కేసు నమోదు చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు