కంటైన్‌మెంట్ కాని ప్రాంతాల్లో సడలింపులు ఎలా వుంటాయంటే?

శనివారం, 30 మే 2020 (20:20 IST)
కంటైన్‌మెంట్ కాని ప్రాంతాల్లో ప్రకటించిన కొన్ని కార్యకలాపాలు మినహా అన్ని కార్యకలాపాలనూ దశల వారీగా పునరుద్ధరించటం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. మొదటి దశలో సడలింపుల్లో భాగంగా 2020 జూన్ 8వ తేదీ నుంచి.. దేవాలయాలు, మత ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు ప్రజల కోసం తెరవడం చేయొచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లు కూడా. షాపింగ్ మాల్స్ వంటివి కూడా తెరవవచ్చు. ఈ ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాప్తిని నివారించటానికి సామాజిక దూరం పాటించేలా చూడటానికి కేంద్ర ఆరోగ్య శాఖ ఎస్‌ఓపీలను జారీ చేస్తుంది.
 
రెండో దశలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించిన తర్వాత స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు, శిక్షణా సంస్థలు, కోచింగ్ సంస్థలు మొదలవైనవాటిని తెరుస్తారు. రాష్ట్రాలు, యూటీలు ఆయా సంస్థల స్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర భాగస్వాములతో సంప్రదింపులు జరపవచ్చు. ఈ చర్చల్లో వెల్లడైన అభిప్రాయాలు ఆధారంగా ఈ సంస్థలను పున:ప్రారంభించే అంశం మీద జూలైలో నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు