భార్యపై అనుమానం.. కత్తితో 25 సార్లు పొడిచి చంపేశాడు..

శనివారం, 10 ఏప్రియల్ 2021 (20:59 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య చోటుచేసుకుంటున్న వాదనలే నేరాలకు తావిస్తున్నాయి. ఇంకా వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. 
 
తాజాగా భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఈ ఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీ బుద్ధ విహార్‌ మార్కెట్‌ ప్రాంతంలో హరీశ్‌ అనే వ్యక్తి తన భార్య నీలును శనివారం మధ్యాహ్నం అందరూ చూస్తుండగా కత్తితో 25 సార్లు పొడిచాడు. 
 
ఆమెను కాపాడేందుకు దగ్గరకు రాబోయిన కొందరిని ఆ కత్తితో బెదిరించాడు. కొంతసేపటికి రక్తం మడుగుల్లో నీలు చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి భర్త హరీశ్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఒక మ్యారేజ్‌ బ్యూరోలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు