పెళ్లైన రెండు రోజులకే ప్రేయసిని లేపుకెళ్లాడు.. సోదరుడినని ఎంట్రీ ఇచ్చి..?

గురువారం, 17 డిశెంబరు 2020 (10:13 IST)
ప్రేమ కోసం ఆ యువకుడు పెళ్లైన రెండు రోజులకే ప్రేయసిని లేపుకెళ్లాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సోదరుడినంటూ ఆ అమ్మాయి మెట్టినింటికి వెళ్లిన అతడు ప్రేయసిని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. ఉత్తర్​ప్రదేశ్ ఫిరోజాబాద్​లోని షికోహాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. నవంబర్ 25న ఓ జంటకు పెళ్లి జరిగింది. వివాహం తర్వాత పెళ్లి కూతురిని.. పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్లారు. వివాహం తర్వాత చేయాల్సిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇదే సమయంలో పెళ్లి కూతురు ప్రియుడు రంగప్రవేశం చేశాడు. 
 
తాను ఆమెకు సోదరుడినంటూ ఎంట్రీ ఇచ్చాడు. అందరినీ నమ్మించేశాడు. కుటుంబమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఇదే అదునుగా కొత్త పెళ్లి కూతురిని ఆ ప్రియుడు ఎత్తుకెళ్లిపోయాడు. ఎవరికీ అనుమానం రాకుండా, గట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లాడు. 
 
పెళ్లి కోసం తనకు పెట్టి నగలన్నీ ఆ అమ్మాయి వెంట పట్టుకెళ్లిపోయింది. సోదరుడినంటూ వచ్చిన అతడితో పాటు పెళ్లి కూతురు కూడా కనిపించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎంత వెతికినా ఆ ఇద్దరూ దొరకలేదు. దీంతో ఈ విషయాన్ని పెళ్లి కూతురు కుటుంబానికి సమాచారం ఇచ్చిన.. పెళ్లి కొడుకు ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్లారు. ముమ్మరంగా గాలించారు. అయినా వారి జాడ దొరకలేదు.
 
వివాహమైన రెండు రోజులకే అమ్మాయి జంప్ అయిన విషయంపై పెళ్లి కొడుకు స్థానిక పోస్ స్టేషన్​‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే అమ్మాయి కుటుంబ సభ్యులు సైతం మరో ఫిర్యాదు చేశారు. ఇక పారిపోయిన ప్రేమికుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు