అటల్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. విశేషాలివే...

శనివారం, 3 అక్టోబరు 2020 (18:55 IST)
Atal Tunnel
ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్‌ను శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. హిమాలయ పర్వత సానువుల్లో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సొరంగ మార్గాన్ని 9.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి-లేహ్‌ జాతీయ రహదారిపై లాహౌల్‌-స్పిటీ జిల్లాలో రోహ్‌తంగ్‌ పాస్‌ వద్ద నిర్మించారు. 
 
గతంలో ఈ మార్గాన్ని రోహ్‌తంగ్ టన్నెల్ అని పిలిచేవారు. కానీ 2019 డిసెంబరు 24 తేదీన అటల్‌ టన్నెల్‌గా పేరు మార్చారు. దేశ ప్రధాని పదవిలో అటల్ బిహార్ వాజ్‌పేయీ ఉన్న సమయంలో అంటే 2000 జూన్‌ 3న ఈ సొరంగ మార్గం నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత సరిగ్గా రెండేళ్ల తర్వాత అంటే 2002 మే 26 తేదీన ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
 
అయితే ఈ సొరంగ మార్గాన్ని అధికారులు ఆరేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా వాతావరణ పరిస్థితులు మరి కొన్ని కారణాలతో నిర్మాణం కాస్త ఆలస్యం అయింది. అయితే గత కొద్ది రోజుల క్రితమే ఈ సొరంగ మార్గం అందుబాటులోకి రావడంతో శనివారం ప్రధాని నరేంద్రమోడి దాన్ని ప్రారంభించారు. ఇక ఈ నిర్మాణంలో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) కీలక పాత్ర పోషించింది.
 
ఈ సొరంగమార్గం విశేషాలు.. 
ఇది సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. 
ఈ సొరంగ మార్గంలో ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్‌, 60 మీటర్లకు అగ్ని మాపక వ్యవస్థను కలిగివుంటుంది. 
ఇంకా 500 మీటర్లకు అత్యవసర మార్గం, 250 మీటర్లకు సీసీ కెమెరా,
2.2 కి.మీ.లకు వెలుతురు ప్రసరించే వ్యవస్థ, 1 కి.మీ.కు గాలి నాణ్యతను పరీక్షించే వ్యవస్థ లాంటి సౌకర్యాలు ఉంటాయి. 
ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన సొరంగ మార్గాల్లో ఇదే అత్యంత పొడవైంది. 
అంతే కాదు సరిహద్దుల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా ఈ సొరంగం ద్వారా సైనిక వాహనాల్లో సామగ్రిని త్వరితగతిన తరలించ డానికి వీలుగా ఉంటుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు