సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌‌ది ఆత్మహత్య కాదు.. హత్యే.. దావూదే కారణం?

బుధవారం, 15 జులై 2020 (17:40 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ మృతి పట్ల భారత అత్యున్నత నిఘా సంస్థ 'రా' (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) మాజీ అధికారి ఎన్‌కే సూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని... అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠానే హత్య చేసిందని ఆరోపించారు. దీని వెనుక దావూద్ ప్రమేయం కూడా ఉందని అన్నారు. 
 
చాలామంది బి-టౌన్ సెలబ్రెటీలు విదేశాలలో దావూద్ బృందం నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొంటారు. గ్యాంగ్ స్టర్ డబ్బు సంపాదించడానికి సహాయం చేస్తుంటారు. ఇది ఐఎస్ఐ నిధుల కోసం ఉపయోగించబడుతుంది. సెలబ్రెటీలు ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బును అందుకుంటారని ఎన్కే సూద్ తెలిపారు. ఈ ముఠానే సుశాంత్‌ని ఫోన్ ద్వారా బెదిరించిందని, అది అతడిని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టిందని సూద్ పేర్కొన్నారు.
 
అంతేకాకుండా దావూద్ నుంచి తప్పించుకునేందుకు సుశాంత్ తన ఫోన్ నంబరును 50 సార్లు మార్చాడని చెప్పారు. సుశాంత్ మరణానికి ఒక రోజు ముందు సీసీటివి కెమెరాలు ఆగిపోవడం గురించి కూడా సూద్ మాట్లాడారు. అతడు ఆత్మహత్య చేసుకున్న గది తాళం కూడా నకిలీవన్నారు. ఇంతకంటే.. సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే అనేందుకు ఆధారాలు ఏం కావాలని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు