అటు కరుణ.. ఇటు నటరాజన్ ఆరోగ్యంపై వదంతులపై... తమిళనాడులో హైఅలెర్ట్

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (16:58 IST)
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. అటు కరుణానిధి, ఇటు వీకే శశికళ భర్త నటరాజన్‌ల ఆరోగ్యం బాగా క్షీణించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ రాజేంద్రన్ హై అలెర్ట్ సందేశాలను పంపించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధమైన టెన్షన్ వాతావరణం నెలకొంది. 
 
అదేసమయంలో రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు సీహెచ్. విద్యాసాగర్ రావు మంగళవారం రాజధాని చెన్నైకు చేరుకున్నారు. దీంతో అసలు ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠ నెలకొంది. 
 
మరోవైపు... సెలవుల్లో ఉన్న పోలీసులు కూడా విధులకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు.. కరుణానిధి ఆరోగ్యంపై వదంతులను ఆయన కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు.
 
ఇంకోవైపు... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శశికళ భర్త నటరాజన్‌ పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో ఆయన కోసం చిన్నమ్మ పెరోల్‌ మీద వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అనంతరం ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా ఆమె మద్దతుదారులు వీరంగం సృష్టించొచ్చన్న రహస్య సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు