నా మొగుడికి 40 రోజులుగా మద్యం లేదు.. పైగా ఎండలో నిల్చోలేడు.. అందుకే...

బుధవారం, 6 మే 2020 (10:31 IST)
పలువురు పురుషులు మద్యానికి బానిసలు కావడానికి ప్రధాన కారణంగా వారి భార్యలు లేదా కుటుంబాలే. ఈ విషయం పలుమార్లు నిరూపితమైంది కూడా. అనేక చోట్ల భర్తలను పలు వ్యసనాలకు బానిసలు చేయడంలో భార్యల పాత్ర కీలకంగా ఉంటుంది. అలాంటి సంఘటనే ఒకటి ఇపుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో 46 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. 
 
దీంతో మందుబాబులు వైన్ షాపులకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అయితే, ఆ భార్య మాత్రం తన భర్తను ఇంట్లోనే ఉండమని చెప్పి మద్యం షాపుకు వచ్చిన భర్తకు ఇష్టమైన మద్యం బ్రాండ్లను కొనుగోలు చేసుకుని వెళ్లింది. పైగా, తన భర్త ఎండలో నిల్చుని మద్యం కొనుగోలు చేయలేడనీ అందుకే తాను కొనుగోలు చేసి తీసుకెళుతున్నట్టు తనను ప్రశ్నించిన పోలీసులకు సెలవిచ్చింది. దీంతో ఖాకీలు ఖంగుతిన్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఓ మద్యం దుకాణం తెరిచారు. దీంతో మందుబాబులంతా అక్కడకు వచ్చిన తమకిష్టమైన బ్రాండ్లను కొనుక్కుని వెళుతున్నారు. ఇలాంటి వారిలో ఓ మహిళ కూడా ఉంది. ఆమె దుకాణానికి చేరుకునే సమయానికి చాంతాడంత క్యూ చేరిపోయింది. అయినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కితగ్గలేదు. పురుషులతో కలిసి వరుసలో నిల్చుంది. 
 
ఆ వరుసలో గంటల కొద్దీ నిల్చున్న తర్వాత ఎట్టకేలకు ఆమె వంతు వచ్చింది. నేరుగా కౌంటర్ వద్దకు వెళ్ళి భర్తకు నచ్చిన మద్యం బ్రాండ్లను కొనుగోలు చేసి, వాటిని తన పైటకొంగుచాటు దాచిపెట్టుకుని ఇంటికి బయలుదేరింది. ఆమెను ఆసక్తిగా గమనించిన అక్కడున్న వారు ఆమెను ఆపి విషయం ఏంటని ఆరా తీశారు. 
 
ఆమె చెప్పింది విని ఎంత గొప్ప భార్యో అనుకున్నారు. తన భర్త 40 రోజులుగా మద్యం తాగలేదని, ఇంతసేపు ఎండలో నిల్చుని మద్యాన్ని కొనుగోలు చేయలేడని, అందుకే తాను వచ్చానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో అక్కడున్న పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఇలాంటి భార్యలు ఉన్నంతకాలం భర్తలు మారరని పలువురు మహిళలు కామెంట్స్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు