దేవుడు ఆదేశించాడు, రజినీకాంత్ ఆ పని చేస్తున్నాడు?

శనివారం, 24 అక్టోబరు 2020 (19:43 IST)
వచ్చే యేడాదే తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పటికే అధికార అన్నాడిఎంకే, ప్రతిపక్ష డిఎంకే పార్టీలు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు ప్రారంభించేశాయి. ముఖ్యంగా డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ అయితే ఏకంగా సభ్యత్వ నమోదుతో జనాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
దీంతో సూపర్ స్టార్ రజినీకాంత్ మెల్లమెల్లగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలు చూపిస్తున్నారు. ముఖ్యంగా మక్కల్ మండ్రం అనే తన సొంత స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు రజినీకాంత్. తన అభిమాన సంఘంతో మాట్లాడిన రజినీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఆదేశించారట.
 
సభ్యత్వ నమోదు పూర్తయిన వెంటనే పార్టీని ప్రకటించి ఆ తరువాత ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారట రజినీ. అయితే ఈ సభ్యత్వ నమోదు పూర్తయ్యిందే సభ్యులకు ఫోటోలతో కూడిన గుర్తింపు కార్డులు ఇవ్వాలని కూడా సూచించారట. ఎలాంటి ఆర్భాటంగా లేకుండా ప్రశాంతంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రకటన చేయాలన్నది రజినీ ఆలోచనట. ఇదే తన సన్నిహితులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈసారి తమిళనాడు ఎన్నికలు మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు