షాకింగ్ న్యూస్.. ట్రయల్ రూమ్‌లో డ్రెస్ మార్చుకుంటున్నారా?

శనివారం, 7 సెప్టెంబరు 2019 (17:52 IST)
ఓ షాకింగ్ ఘటన దక్షిణ ఢిల్లీలో చోటుచేసుకుంది. ఓ జర్నలిస్టు ట్రయల్ రూమ్‌లో దుస్తులు మార్చుకుంటున్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీశారని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీ ఎమ్ బ్లాక్ మార్కెట్లోని ప్రముఖ ఇన్నర్‌వేర్ దుస్తుల కొట్టుకు 27 ఏళ్ల జర్నలిస్టు వెళ్లారు. అక్కడ కొన్ని దుస్తులను ఎంపిక చేసిన ఆమె ట్రయల్ రూమ్‌లోకి వెళ్లింది. 
 
ఆ జర్నలిస్టు సగం దుస్తులు ధరించి వుండగా, దుకాణంలోని ఒక సిబ్బంది తలుపు తట్టారని, గదిలో సీసీటీవీ ఉందని సిబ్బంది చెప్పడంతో.. జర్నలిస్ట్ ఆమె దుస్తులను పైకి లాక్కుని తలుపు తెరిచారు. ఇంకా సిబ్బంది మరో ట్రయల్ రూమ్ ఉపయోగించమని జర్నలిస్టును కోరారు. 
 
అయితే ఆ ట్రయల్ రూమ్‌లో కూర్చున్న దుకాణదారుడు ట్రయల్ రూమ్‌లోపల ఆమె మార్చిన బట్టల ప్రత్యక్ష ఫుటేజీని చూస్తున్నాడని తెలుసుకుని జర్నలిస్టు సిబ్బందిపై గట్టిగా అరిచారు. ఈ ఘటనపై జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఇంతలో షాపు కీపర్ తన కొడుకును పిలిపించి వీడియోను తొలగించాడు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, మహిళను ట్రయల్ రూమ్‌కు బదులుగా పొరపాటున స్టోర్ రూమ్‌కు పంపినట్లు తెలిసింది. అయితే, పోలీసు అధికారులు సీసీటీవి ఫుటేజీని సేకరించి తదుపరి దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు