ఎనిమిది దిక్కుల్లో దీపాలు వెలిగిస్తే? దక్షిణ దిశలో మాత్రం వద్దే వద్దు.. ఎందుకు?

శుక్రవారం, 29 జూన్ 2018 (15:04 IST)
దిక్కులు ఎనిమిది. ఈ ఎనిమిది దిక్కుల్లో దీపమెలిగిస్తే ఎలాంటి ఫలితాలను పొందవచ్చో చూద్దాం.. 
 
తూర్పు- ఈ దిశలో దీపమెలిగించడం ద్వారా జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. గ్రహ దోషాలు తొలగి.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. గృహం లేనివారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇలా అద్దె ఇంటికి స్వస్తి చెప్తారు. 
 
పడమర- ఈ దిశలో దీపం వెలిగించడం ద్వారా శత్రుభయం వుండదు. ధనంతో వచ్చే విభేదాలు తొలగిపోతాయి. రుణబాధలుండవు. 
 
ఉత్తరం- ఈ దిశలో దీపం వెలిగించడం ద్వారా శుభకార్యాలు దిగ్విజయం పూర్తవుతాయి. పాపాలు తొలగిపోతాయి. సౌభాగ్యం చేకూరుతుంది. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. 
 
దక్షిణం- అయితే దక్షిణం వైపు దీపాలను వెలిగించకూడదు. ఈ దిశలో దీపాలను వెలిగిస్తే మృత్యు భయాలుంటాయి. కానీ ఆలయాల్లో దక్షిణం వైపు దీపమెలిగించడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. ఇంట మరణించిన వారికి సద్గతి పొందవచ్చు. 
 
ఆగ్నేయ- ఈ దిశలో దీపం వెలిగించడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఉన్నత విద్యలను అభ్యసిస్తారు. పిల్లలు విద్యారంగంలో రాణించాలంటే.. నైరుతి దిశలో దీపమెలిగించి ఆ ధూపాన్ని పిల్లల నుదుట చూపించాలి. 
 
నైరుతి- ఈ దిశలో దీపం వెలిగిస్తే.. స్త్రీపురుషులకు వచ్చే ఆపదలు తొలగిపోతాయి. కలహాలుండవు. వివాహ దోషాలు తొలగిపోతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. 
 
ఈశాన్యం- ఈ దిశలో దీపమెలిగించడం ద్వారా ఇంటి యజమానికి సుభిక్షం చేకూరుతుంది. ఇంటి యజమానికి కార్యసాధనలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. యజమానితో పాటు ఆయన సంతానం ఇతరులకు దానధర్మాలు చేసే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. 
 
వాయువ్య - దిశలో దీపమెలిగించడం ద్వారా సోదరీసోదరుల మధ్య ఐక్యత నెలకొంటుంది. కుటుంబంలో తగాదాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు