పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మరోసారి అన్యమత ప్రచారం జరిగింది. ఎస్ఎన్సి కాటేజీల వద్ద మతప్రార్థనలు చేస్తున్న వ్యక్తిని టిటిడి విజిలెన్స్, నిఘా సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. అన్యమతస్థుడి నుంచి ఒక బైబిల్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల ధార్మిక క్షేత్రంలో హిందూ మతానికి సంబంధించిన తప్ప మరే ఇతర మతాల వారు ప్రార్థనలు గానీ మతప్రచారం చేయకూడదన్న నిషేధం ఉంది.