తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సోమవారం, 29 జూన్ 2020 (11:25 IST)
తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు ఆ రాష్ట్ర హైకోర్టు సమ్మతం తెలిపింది. సచివాలయం కూల్చివేతలో ఎదురైన అడ్డంకులన్నీ ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికమించి, విజయం సాధించింది. ఫలితంగా తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. 
 
సచివాలయం కూల్చివేతపై వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. దీంతో సచివాలయం కూల్చివేతపై వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కేబినెట్‌ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సెకట్రేరియట్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.
 
మరోవైపు, పాత సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ ధాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సచివాలయాన్ని కూల్చి కొత్త సెక్రటేరియట్ కట్టాలని ప్రభుత్వం భావించింది. 
 
దీనిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. చివరకు మార్చి 10న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై హైకోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు