పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు.. కత్తితో పొడిచిన ప్రియుడు... ఎక్కడ?

సోమవారం, 19 అక్టోబరు 2020 (09:32 IST)
హైదరాబాద్ నగరంలోని రెయిన్ బజారులో దారుణం జరిగింది. ప్రేమించిన ప్రియుడుని పెళ్లి చేసుకోమని ప్రియురాలు కోరింది. అంతే.. ఒక్కసారి ఆగ్రహం చెందిన ప్రియుడు.. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నారాయణఖేడ్‌కు చెందిన రాధిక (23) తల్లిదండ్రులతో కలిసి ఆసిఫ్‌నగర్‌లో ఉంటూ  దిల్‌సుఖ్‌నగర్‌లోని మహాత్మాగాంధీ న్యాయ కాలేజీలో నాలుగో ఏడాది చదువుతోంది. అదేసమయంలో పీపుల్స్ ఫర్ యానిమల్ సొసైటీలో వలంటీరుగానూ పనిచేస్తోంది. 
 
ఈ క్రమంలో అదే సంస్థలో వలంటీరుగా పనిచేస్తున్న హైదరాబాద్, రెయిన్‌ బజార్‌కు చెందిన ముస్తఫా (19)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇదికాస్త వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ముద్దూ ముచ్చట తీర్చుకున్నారు. 
 
అయితే, గత నెల రోజులుగా ప్రియురాలు రాధికకు ముస్తఫా దూరంపెట్టసాగాడు. పైగా, తన ఫోను కూడా స్విఛాఫ్ చేశాడు. దీంతో ఏం జరిగిందో తెలుసుకుందామని శనివారం రాత్రి ముస్థాపా ఇంటికి వెళ్లింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నావని నిలదీసింది. 
 
అలాగే, వారిద్దరి మధ్య తెల్లవారుజామువరకు వారి మధ్య వాగ్వివాదం జరిగింది. అయినప్పటికీ రాధిక వెనక్కి తగ్గకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ముస్తఫా, తన సోదరుడు జమీల్ (23)తో కలిసి రాధికను కత్తితో పొడిచి చంపేశాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. హత్యాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ నిందితులపై హత్య కేసుతో పాటు.. మోసం, అట్రాసిటీ కేసును కూడా నమోదు చేశారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు