స్టాఫ్‌ నర్సుపై అత్యాచారానికి పాల్పడిన డ్యూటీ డాక్టర్.. ఎక్కడ?

ఆదివారం, 30 ఆగస్టు 2020 (15:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఏరియా ఆస్పత్రిలో పని చేసే స్టాఫ్ నర్సుపై డ్యూటీ డాక్టర్ ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ద‌వాఖాన‌లో ఓ మహిళ స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. ఇదే ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడు ఒకడు... గ‌త కొన్ని రోజులుగా తన కోర్కె తీర్చాలంటూ స్టాఫ్ న‌ర్సును వేధిస్తూ వచ్చాడు. 
 
ఈ క్ర‌మంలో ఆగ‌స్టు 24న వైద్యుడు ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. అదునుచూసి ఆ నర్సుపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కేసు న‌మోదు చేసిన‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు