తెలంగాణ పదోతరగతి పుస్తకాల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్

శనివారం, 5 సెప్టెంబరు 2020 (14:15 IST)
నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా పాఠ్యాంశాన్ని రూపొందించారు. సినిమా హీరోగా ప్రస్థానం మొదలు పెట్టిన ఎన్టీఆర్ గొప్ప స్థాయికి ఎదిగి ఆ తరవాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారు.
 
అధికారంలోకి వచ్చిన తరవాత 2 రూపాయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేధం వంటి పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. దాంతో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా మారిస్తే ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
పదోతరగతి సాంఘిక శాస్త్రంలో పేజీ నంబర్ 268లో ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు