పాపం.. సందీప్ రెడ్డి, సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రావడం లేదా..?

బుధవారం, 21 అక్టోబరు 2020 (22:33 IST)
టాలీవుడ్, బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా ఇది. టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి బాలీవుడ్లో సైతం అదే స్థాయిలో సంచలనం సృష్టించడం విశేషం. దీంతో ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కట్టారు.
 
మహేష్‌, రామ్ చరణ్‌ సందీప్ రెడ్డితో సినిమా చేయాలనుకున్నారు కానీ... సందీప్ చెప్పిన స్టోరీ మహేష్‌ బాబుకి కానీ, చరణ్‌‌కి కానీ నచ్చలేదు. దీంతో ఈ ప్రాజెక్టులు సెట్ కాలేదు.
 
 బాలీవుడ్లో కూడా సందీప్ రెడ్డికి భారీ ఆఫర్స్ వచ్చాయి కానీ... అక్కడ కూడా ఇదే ప్రాబ్లమ్. ఆయన చెప్పిన స్టోరీ హీరోలకు నచ్చడం లేదో లేక నిర్మాతలతో ప్రాబ్లమో కానీ ఇప్పటివరకు తదుపరి చిత్రం ఏంటి అనేది ఎనౌన్స్ చేయలేదు.
 
ఇలా... ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో సందీప్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకున్నారట. అది ఏంటంటే... తన తర్వాత సినిమాలన్నింటినీ తానే స్వయంగా నిర్మించుకోవాలని అనుకుంటున్నానని, వేరొకరు తన సినిమాకు డబ్బు పెడితే తనకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండదన్నారు. అందుకే తానే నిర్మించుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు.
 
‘కబీర్ సింగ్ తర్వాత సందీప్ రెడ్డితో సినిమాలు నిర్మించడానికి చాలా మంది ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చారు. అయితే... క్రియేటీవ్ ఫ్రీడమ్ కోసం ఇక నుంచి తన సినిమాలను తనే నిర్మించుకుంటాను అంటున్నారు. అదీ.. సంగతి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు