విజయ్ దేవరకొండతో మళ్లీ గీత గోవిందం హీరోయిన్..?

బుధవారం, 26 ఆగస్టు 2020 (13:49 IST)
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక మందన జత కట్టనుంది. తాజాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. 
 
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత 'గీతగోవిందం' అనే సినిమా చేసి హిట్ అందుకున్నాడు విజయ్. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది.
 
ఇదే హీరోయిన్‌తో 'డియర్ కామ్రేడ్' అనే సినిమా చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా మరో సారి రష్మికతో కలిసి నటించనున్నాడనే వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. అయితే అది సినిమా కోసం కాదట. ఒక యాడ్ కోసం ఈ ఇద్దరు మరోసారి కలిసి నటించనున్నారని తెలుస్తోంది.
 
ప్రముఖ వస్త్ర కంపెనీకి సంబంధించిన యాడ్‌లో ఈ ఇద్దరు నటించబోతున్నారని సమాచారం. అయితే ఈ బ్రాండ్‌కి ఈ బ్యూటీని విజయ దేవరకొండనే సిఫార్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు తమిళ్‌లో 'సుల్తాన్'.. కన్నడలో 'పొగరు' చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు