గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన యువ నటి నక్షత్ర

సోమవారం, 6 జులై 2020 (22:22 IST)
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-పౌండర్ రాఘవ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు ఆదర్శ నగర్‌లో మొక్కలు నాటింది యువ కథానాయిక నక్షత్ర ( పలసా 1978 సినిమా).
 
ఈ సందర్భంగా నక్షత్ర మాట్లాడుతూ... రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా నేను మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. పచ్చదనం పెంచడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
 
ఈ సందర్భంగా "విరివిగా మొక్కలు నాటండి పచ్చదనాన్ని పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అని తెలిపారు". ఈ సందర్భంగా ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్, హీరోయిన్ రమ్యకృష్ణ , పలాస 1978 సినిమా డైరెక్టర్ కరుణ కుమార్‌లను గ్రీన్ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు