బాలకృష్ణ "నర్తనశాల" ఫస్ట్ లుక్ రిలీజ్

మంగళవారం, 20 అక్టోబరు 2020 (12:52 IST)
గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రారంభమైన చిత్రం "నర్తనశాల". ఇందులో 'అర్జునుడు'గా బాలయ్య నటిస్తున్నారు. 'ద్రౌపది' పాత్రలో సౌందర్యను ఎంపిక చేయగా, భీముడుగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించేలా బాలకృష్ణ స్వీయ దర్శకత్వం వహించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. అయితే, సౌంద‌ర్య హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన త‌ర్వాత ఆగిన ఈ చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టివ‌ర‌కు మొద‌లు కాలేదు. ఈ మూవీని ఎప్ప‌టికైన పూర్తి చేయాల‌ని బాలయ్య ఆకాంక్ష‌. 
 
ఈ నేపథ్యంలో అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా (అక్టోబ‌ర్ 24న‌) ఎన్.బి.కె. థియేటర్‌లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది అని బాల‌కృష్ణ స్ప‌ష్టం చేశారు. 
 
తాజాగా న‌ర్త‌నశాల నుంచి బాల‌కృష్ణ‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో బాల‌య్య లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కాగా, ప్రస్తుతం బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్‌లో ఓ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం తెరకెక్కుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు