సైరా ఊపుతో చిరంజీవి, కొరటాల దర్శకత్వంలో చిరు 152 స్టార్ట్

మంగళవారం, 8 అక్టోబరు 2019 (16:51 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పైన రాంచరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం దసరా నాడు ప్రారంభమైంది. చిరంజీవి ఖైదీ నెం. 150తో రీ-ఎంట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన నేపధ్యంలో ఆ తర్వాత సైరాతో తన స్టామినా ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు. 
 
ఇప్పుడు అదే ఊపుతో చిరంజీవి మరో చిత్రాన్ని చేసేందుకు సై అనేశారు. ఈ చిత్రంలో ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి నిర్మాతలు : రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి; దర్శకత్వం: కొరటాల శివ

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు