అందరి కళ్లు నా మీదే వుంటాయి... అందుకే..?: రకుల్ ప్రీత్ సింగ్

ఆదివారం, 7 అక్టోబరు 2018 (16:28 IST)
ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రధారిగా గ్లామర్ తార రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ అవకాశం తనకు దక్కడంపై రకుల్ తాజాగా హర్షం వ్యక్తం చేసింది. అంతేగాకుండా కోట్లాది మంది భారతీయ అభిమానుల్ని సొంతం చేసుకున్న లెజెండ్ శ్రీదేవికి తానూ ఓ అభిమానిని అని రకుల్ చెప్పుకొచ్చింది.


అలాంటి తాను ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రలో కనిపించనుండటం చెప్పలేనంత ఆనందంగా వుందని రకుల్ వెల్లడించింది. చాలా ఛాలెంజ్‌తో కూడిన ఆ పాత్రకు న్యాయం చేయగలననే నమ్మకం వుందని రకుల్ తెలిపింది. 
 
ఇకపోతే.. ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ రెండు భాగాల చిత్రంలో మొదటి భాగానికి కథా నాయకుడు, రెండో భాగానికి మహా నాయకుడు అనే పేరు ఖరారు చేశారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో సినిమాల్లో నటించిన శ్రీదేవి పాత్రను రకుల్‌ పోషిస్తోంది. 
 
ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ తానెప్పుడూ శ్రీదేవిని కలవలేదని.. అందుకే ఆమె సినిమాలను చూస్తున్నానని తెలిపింది. ఓ గొప్ప నటి పాత్ర పోషిస్తున్నందుకు ఆనందంగా వున్నా.. అందరి కళ్లు తన మీదే వుంటాయని చాలా జాగ్రత్తలు తీసుకుంటానని రకుల్ తెలిపింది. వంద శాతం శ్రీదేవి పాత్రకు న్యాయం చేయగలననే నమ్ముతున్నట్లు తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు