ప్రభాస్‌ని వదిలేసి పూజా వచ్చేసిందా..?

గురువారం, 5 నవంబరు 2020 (22:02 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాథేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతోన్న భారీ పీరియాడిక్ లవ్ స్టోరీ ఇది. ఈ భారీ చిత్రాన్ని ఏమాత్రం రాజీపడకుండా యు.వి.క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
 
అయితే.. ఈ సినిమా ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రభాస్, పూజతోపాటు టీమ్ అంతా షూటింగ్‌లో పాల్గొన్నారు. సుమారు నెల రోజుల పాటు అక్కడ షూటింగ్‌లో పాల్గొన్న పూజా తాజాగా భారత్‌కు తిరిగి వచ్చింది.
 
 ఈ విషయాన్ని పూజా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియచేసింది. రాధే శ్యామ్ ఇటాలియన్ షెడ్యూల్‌ను పూర్తి చేశాను. ఈ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన టీమ్‌కు ధన్యవాదాలు.
 
హైదరాబాద్‌లో కలుద్దాం ప్రభాస్ అని పూజా పేర్కొంది. ఇటీవల రిలీజ్ చేసిన రాథేశ్యామ్ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగిందని చెప్పచ్చు. ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా కృష్ణంరాజుపై సన్నివేశాలను చిత్రీకరించలేదు.
 
త్వరలోనే కృష్ణంరాజుపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయం సాధిస్తుందో అని అభిమానులు వెయిటింగ్. మరి... ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు