కంగనాపై ఫిర్యాదు.. హృతిక్ రోషన్‌కు ముంబై క్రైమ్ బ్రాంచ్ సమన్లు

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (11:50 IST)
ఒకపుడు పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన ప్రేమ జంటల్లో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ జంట ఒకటి. ఈ తర్వాత వీరి ప్రేమ బ్రేకప్ అయింది. అప్పటి నుంచి వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ వస్తున్నారు. అలాగే, ఒకరిపై ఒకరు పరస్పరం నోటీసులు పంపించుకుంటూ వస్తున్నారు. 
 
ఈ నేప‌థ్యంలో 2016లో కంగ‌న ర‌నౌత్‌పై సైబ‌ర్ పోలీసుల‌కు హృతిక్ రోష‌న్ ఫిర్యాదు చేశారు. న‌కిలీ మెయిల్ ఖాతా నుంచి త‌న‌కు మెసేజ్‌లు, మెయిల్స్ వ‌స్తున్న‌ట్లు చెప్పారు. ఈ కేసును రెండు నెల‌ల క్రితం క్రైమ్ బ్రాంచ్‌కు సైబ‌ర్ పోలీసులు బ‌దిలీ చేశారు.
 
దీంతో దీనిపై విచార‌ణ జ‌రుపుతోన్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హీరో హృతిక్ రోష‌న్‌కు స‌మ‌న్లు పంపి, విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశించారు. కంగ‌నా ర‌నౌత్ ఈ-మెయిల్ కేసులో భాగంగా రేపు విచార‌ణ‌కు వ‌చ్చి, ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని ఆదేశించారు. ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హృతిక్ వాంగ్మూలం న‌మోదు చేయ‌నున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు