జనసేనకు మా సినిమాకు సంబంధం లేదు.. సముద్ర

శుక్రవారం, 22 జనవరి 2021 (16:17 IST)
Jai Sena
తారక్, శ్రీకాంత్, నీతూ ఆరాధ్య, సునీల్ పోలీస్ పాత్ర చేసిన సినిమా జైసేన. ఈ సినిమా గురించి దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. మా "జై సేన" పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధం లేదు. మా సినిమా కంటెంట్ రైతు సమస్యలతో ఉంటుంది. రైతులకు న్యాయం జరగాలని పవన్ పోరాడుతున్నారు. ఇటీవలే ఢిల్లీ లో రైతు పోరాటం తెలిసిందే. మా సినిమాలో రైతు కు న్యాయం ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పాను. 
 
దాన్ని ముఖ్యమంత్రులు కూడా ఆలోచించి రైతులకు న్యాయం ఇవ్వాలని అనుకుంటారు. కేంద్రంలో కూడా ఇలా చేస్తే బాగుంటుంది. రైతులకు పన్ను మినహా ఇంపు ఇవ్వాలి. రైతు కొడుకు రైతు కావాలని అనుకోడు. ఇతర రంగాల్లో వారసులు ఉన్నారు. ఎందుకీ అనేది సినిమాలో చాడాలి. జనవరి 29న రిలీజ్ చేస్తున్నాము.అని తెలిపారు.
 
సునీల్ మాట్లాడుతూ... కృష్ణ సినిమాలు మాత్రమే అమ్మ చూపించేది. సమాజం గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు పిల్లలు చుట్టు పక్కల ఏమి జరిగినా పట్టించుకోరు.అందుకే మారాలి. చిన్నతనంలో మా తాత పొలంకు తీసికెళ్ళి సాధక బాధలు చెప్పేవాడు. వ్యవసాయం వాతావరణంతో లింక్ అయింది. అది మనం తెలుసుకోవాలి. నేను ఐపీఎల్ పాత్ర చేశాను. కొంచెం తిక్క ఉంటుంది. సినిమాలో బాగా వినోదం ఇస్తాను అని  సునీల్ తెలిపాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు